సమంత మరోసారి ఎమోషనల్ అయిందట..!

murali krishna
నాగచైతన్య సమంతల జంటకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదని తెలుస్తుంది..అలాంటి జంట ఇప్పుడు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వస్తున్నాయట.ఎంతవరకు నిజమో కానీ గడిచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సమంత విడాకుల రూమర్స్ సంచలనంగా మారుతున్నాయని సమాచారం.తన ఇంటి పేరు అక్కినేనిని సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తీసేసిన రోజు మొదలైందట ఈ రచ్చ.నిన్న ఒంటరిగా తిరుమల దర్శనానికి సమంత రావటం వరకు జరుగుతూనే ఉందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో సమంత బాధాకర పోస్టులు పెట్టడం అలాగే భర్త లేకుండానే హాలిడే వెకేషన్స్ కి వెళ్ళటం మరియు నాగచైతన్య లవ్ స్టోరీ మూవీపై సాయి పల్లవిని పొగిడి చైతు మాట ఎత్తకపోవటం వంటివి అనుమానాలు తావిస్తున్నాయని సమాచారం.అన్నిటికి మించి మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా కూడా అక్కినేని ఫ్యామిలీ నుండి కానీ సమంత కుటుంబం నుండి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ విడాకుల వార్తపై స్పదించకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని సమాచారం.

ఇక ఇన్ని సంచలనాల నడుమ కెరీర్ లో మాత్రం అద్భుతంగా దూసుకెళ్తుందట సమంత. పెళ్ళికి ముందు కంటే పెళ్లి తరువాతే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ కెరీర్ బెస్ట్ మూమెంట్స్ ని అనుభవిస్తుందని సమాచారం.దీనికి తోడు తాజాగా సమంతకి వరుస అవార్డులు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.మొన్న జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో రాజి పాత్ర చేసినందుకు గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కించుకుందని తెలుస్తుంది.తాజాగా సైమాలోను దుమ్ముదులుపేసిందట సమంత. నందినిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఓ బేబీ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డు లభించిందట. హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ సైమా వేడుకలకి దక్షిణాది తారలు తరలివచ్చారని తెలుస్తుంది.కానీ సమంత మాత్రం గైర్హాజరైందని తెలుస్తుంది. శ్రీశైలం మరియు తిరుపతి అంటూ పుణ్యక్షేత్రాలను దర్శించి.. అటుపై చెన్నైకి వెళ్లిందని తెలుస్తుంది. అందుకే హైద్రాబాద్‌లో జరుగుతున్న సైమా వేడుకలకు హాజరు కాలేకపోయిందని సమాచారం. దీంతో సమంతకు బదులుగా ఆ అవార్డును నందినీ రెడ్డి తీసుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో తానూ ఈవెంట్ కి రాకపోయినా సోషల్ మీడియాలో తనకి ఉత్తమ నటి అవార్డు రావటంపై స్పదింస్తు ఎమోషినల్ అయ్యిందట సమంత. ‘ఓ బేబీ మూవీ నా లైఫ్ లో ఒక ప్రత్యేకమైందని చెప్పిందట.ఈ మూవీకి అవార్డు ఇచ్చినందుకు సైమాకి కృతఙ్ఞతలు అని చెప్పిందట.ఇంత గొప్ప మూవీ నాతో చేసినందుకు నందిని రెడ్డి కి థాంక్స్ అని చెప్పిందట.నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అది నీకు తెలుసు అని చెప్పిందట.అలాగే నీతో మరో అద్భుత మూవీ చేయాలనీ ఉందని సమాచారం.సైమా విజేతలందరికి కంగ్రాట్స్’ అంటూ సమంత ఓ బేబీ, ఉత్తమ నటి అంటూ హ్యాష్ ట్యాగ్‌లను సమంత షేర్ చేసిందని సమాచారం.ఇక సమంత అన్ని అంశాలపై స్పందిస్తున్నా కూడా తనపై వస్తున్న విడాకుల రూమర్స్ ని మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదని తెలుస్తుంది నిన్న తిరుమలలో ఈ ప్రశ్న అడిగిన విలేఖరిపై.. బుద్ది ఉందా? అంటూ ఒక రేంజిలో ఫైర్ అయ్యిందట సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: