నీలాంబరి బర్తడే వేడుకలలో మెరిసిన తారాజువ్వలు.. !

Divya
సినీ ఇండస్ట్రీలోకి రమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఆ తర్వాత బాహుబలి సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఇక ఈమె నరసింహ సినిమాలో నీలాంబరి గా తన అద్భుతమైన నటన మరోసారి బాహుబలి సినిమాలో ప్రదర్శించింది. ఇక ఈ సినిమాలో ఈమె పాత్రకు ముందుగా శ్రీదేవిని అనికోగా, రెమ్యునరేషన్ లో తేడా రావడంతో ఆమె బాహుబలి సినిమాని వదులుకో గా..రమ్యకృష్ణ చేసింది.

రాజమౌళి పెట్టుకున్న నమ్మకానికి బాహుబలి సినిమాలో వందకి 100% శివగామి పాత్ర లో నటించి , ఆ పాత్రకు తగ్గ న్యాయం చేసింది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ మొట్టమొదటి సారిగా సంకీర్తన అనే సినిమాలో నటించింది. ఈమె ఎంతో మంది స్టార్స్ తో ప్రియురాలిగా, విలన్ గా, భార్యగా ,తల్లిగా, భక్తురాలిగా.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో తనదైన శైలిలో ఒక ఇమేజ్ ను  క్రియేట్ చేసుకుంది రమ్యకృష్ణ.
అలా తన టాలెంట్ కి  ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా చేసి తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా  జీవించగలదని నమ్మకాన్ని ఇచ్చింది. ఇక రమ్య కృష్ణ తన 50వ పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగవైభవంగా జరిగినట్లు సమాచారం. ఇక ఈమె భర్త డే వేడుకలకు ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరైనట్లు గా తెలుస్తున్నది. ఇక ఎవరెవరు హాజరయ్యారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఒక ఈ వేడుకలో పాల్గొన్న హీరోయిన్ రాధిక, ఖుష్బూ, త్రిష, లిజీ, రెజీనా.. మరికొంతమంది ఈ వేడుకకు హాజరైనట్లుగా సమాచారం. ఇక ప్రస్తుతం రమ్య కృష్ణ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నది. ఇక సాయి ధరంతేజ్ తో.. రిపబ్లిక్ సినిమాలో , నాగార్జునతో కలిసి బంగార్రాజు.. విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాలలో నటిస్తున్నది. ఇక తన భర్త కృష్ణవంశీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రంగమార్తాండ లో కూడా నటిస్తున్నది. ఏది ఏమైనా ఇంత వయసు వచ్చినా కూడా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది రమ్యకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: