.జాతీయ పతాకం గురించి తెలియని కొన్ని నిజాలు..

Divya
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న, జనవరి 26న, ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూల్లో,జాతీయ జెండాను ఎగుర వేస్తూ ఉంటాము. అయితే ఇలాంటి మన జాతీయ జెండా గురించి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం.


ఒక జాతి స్వాతంత్ర్యం అంటే  సౌభాగ్యం, సంపద, జాతీయ పతాకం లో ప్రతిబింబిస్తుంటాయి. మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం. ఈ త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 జూలై 22 న, ఆమోదించింది.ఈ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన.. పింగళి వెంకయ్య గారు.

పింగళి వెంకయ్య గారు 1906 నుండి 1922 వరకు భారత జాతీయోద్యమం లోని వివిధ ఘట్టాలను పేర్కొన్నారు. మన జాతీయ పిత గాంధీజీ కోరిక మేరకు.. వెంకయ్య గారు ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసి ఇచ్చారు.


త్రివర్ణ పతాకం యొక్క పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉంటాయి. కాషాయం, తెలుగు, ఆకుపచ్చ రంగులు మూడు సమానంగానే ఉంటాయి. మధ్యనున్న తెల్ల భాగంలో గాఢమైన అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రంలో 24 గీతలు ఉంటాయి. ఈ చక్రము యొక్క నమూనాను సారనాథ్ లోని అశోక స్తంభం నుంచి తీసుకున్నారు.

ఇక జాతీయ పతాకంలో కాషాయరంగు త్యాగానికి, తెలుపురంగు శాంతికి, ఆకుపచ్చ రంగు సుశ్యామలానికి ప్రతీకలు. జాతీయ పతాకాన్ని కేవలం ఖాధి బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి.

కాంగ్రెస్ అప్పట్లో 1921 లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారంగా ఒక పతాకాన్ని రూపొందించింది. దీన్ని ఆంధ్రుడైన పింగళి వెంకయ్య గారు తయారు చేసి ఇచ్చారు. ఇక ఈ పతాకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికార పతాకము గా స్వీకరించింది. ఈ పతాకానికి ఎటువంటి మత పూరితమైన.. ప్రతీకలు లేవు. అలా తయారు చేసిన కాంగ్రెస్ పతాకాన్ని మార్పులు చేర్పులు చేసి జాతీయ జెండాగా ఆవిష్కరించింది అప్పట్లోని ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు రాట్నం స్థానంలో అశోకచక్రం ఉంచడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: