రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

VUYYURU SUBHASH
నందమూరి తారక రామారావు.. అక్కినేని నాగేశ్వరరావు.. వీరిద్దరు తెలుగు సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వారు. అప్పట్లో విరివిగా వీరు ఎన్నో సినిమాలలో నటించి, ఒక ఒక రికార్డు సృష్టిస్తే , ఆ తర్వాత ఇద్దరూ కలిసి  ప్రేక్షకులకు కన్నుల పండుగగా చేయడమే కాకుండా, ఒక ప్రభంజనం సృష్టించిన సూపర్ స్టార్స్  అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ తెరపై కనిపిస్తున్నారు అంటే, ఇక అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఏదో ఒక కొత్త అనుభూతి. అంతే కాదు మొదట వీరిద్దరూ చాలా మంచి మిత్రులు. అందుకే స్నేహం అనే  అభిమానంతోనే ఇద్దరూ కలసి చిత్రాలు చేసేవారు.

అయితే ఒకానొక సందర్భంలో ఈ ఇద్దరు ఏదో గొడవ కారణంగా కొన్ని సంవత్సరాల పాటు , మాట్లాడుకోలేదన్న విషయం కూడా తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, తిరిగి మాట్లాడిన విషయం అందరికీ తెలిసు. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో ఒక సినిమాకు ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావును  బాగా బ్రతిమాలాడుకున్నారట. అయినా కానీ  అక్కినేని నాగేశ్వరరావు ఎందుకో తెలియదు రెండుసార్లు నో చెప్పడంతో పంతం మీద సినిమా తీసి,  భారీ హిట్  కొట్టాడు మన ఎన్టీఆర్. అయితే ఆ సినిమా ఏదో తెలుసుకుందాం.

ఎన్టీఆర్ చిత్రాలలో దానవీరశూరకర్ణ ఒకటి . ఆయన ఈ చిత్రం రూపొందించడానికి వెనుక పెద్ద కథే ఉంది. తమిళంలో  బి.ఆర్.పంతులు భారీ ఎత్తున కర్ణ చిత్రాన్ని నిర్మించారు. శివాజీ గణేషన్ కర్ణుడుగా నటించారు. కర్ణ  జీవితాన్ని సమగ్రంగా పరిశీలించి , సినిమాగా తీయాలనే  ఆలోచన ఎన్టీఆర్ కి వచ్చింది. స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత ఒక దిశలో కర్ణ పాత్ర ధరించమని అక్కినేని నాగేశ్వరరావు ను  కోరారు. అక్కినేని సున్నితంగా తన విముఖతను తెలియజేశారు. దాంతో కృష్ణ పాత్ర అయినా ధరించండి అని అడిగితే,  దానికి కూడా ఆయన అంగీకరించలేదు . దీంతో ఆవేశానికి  గురైన ఎన్టీఆర్ శ్రీకృష్ణ , కర్ణ , సూయోధన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: