విడుదలకు నోచుకోని ఉదయ్ కిరణ్ సినిమా.. త్వరలో ఓటిటిలో రిలీజ్?

praveen
ఉదయ్ కిరణ్.. ఈ పేరు చెబితే చాలు తెలుగు చిత్ర పరిశ్రమలోని ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ తర్వాత మరోసారి అంతటి క్రేజ్ సంపాదించుకుంటాడు అని అభిమానులు భావించారు. కానీ అనుకోని విధంగా ఉదయ్ కిరణ్ కెరీర్... కాదు కాదు జీవితమే అర్ధాంతరంగా   ముగిసిపోయింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. తన నటనతో తన మంచి మనసుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 ఇక పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి.  దీంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయ్. దీంతో మనస్థాపం చెందిన యువ హీరో ఇక తన జీవితాన్ని తన చేతులతో ముగించుకున్నాడు. ఏకంగా తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయి దాదాపు ఏడేళ్లు పూర్తియ్యాయి. ఇక నేడు ఉదయ్ కిరణ్  పుట్టినరోజు ఈ సందర్భంగా ఇక ఆయన స్మృతులను స్మరించుకుంటున్నారు ఎంతోమంది అభిమానులు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నటించిన చివరి చిత్రం... చిత్రం చెప్పిన కథ.

 అయితే ఈ సినిమా ఇప్పటికీ కూడా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత రెండు నెలల్లోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. అయితే ఈ సినిమాను త్వరలో ఓటీటీ లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ సినిమాను ఓటిటి విడుదల చేస్తే ఉదయ్ కిరణ్ అభిమానులు అందరూ బాగా ఆదరించే అవకాశం ఉన్నట్లు మేకర్స్ భావిస్తున్నారట. 2020 లో నే ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేయాలని భావించినప్పటికీ ఇక రేట్స్ రాకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను ఓటిటి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు గట్టిగానే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం  ఇదే నిజమైతే అటు ఉదయ్ కిరణ్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆనంద పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: