హరి హర వీరమల్లుపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
ఈ క్రమంలో ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మీడియాతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.తాజాగా ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్, రిలీజ్ ల గురించి అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యిందని అంటే యాభై శాతం పూర్తయిందని..చివరిగా చేసిన షెడ్యూల్ లో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు షూటింగ్ జరిపామని.. తరువాత పవన్ కరోనా బారిన పడటం, అలానే లాక్ డౌన్ కారణంగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టలేకపోయామని రత్నం తెలిపారు.
ఇక ప్రస్తుతం పవన్ సెట్లో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారని.. కొత్త షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రామ్ పాల్ జాయిన్ అవుతారని చెప్పారు.బాలీవుడ్ టాలెంటెడ్ హీరో అర్జున్ రామ్ పాల్.. ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారని చెప్పారు. తనకు ఈ సినిమా గొప్పగా తీయాలనే ఆలోచన తప్ప బడ్జెట్ గురించి ఆలోచించడం లేదని ఏ ఎం రత్నం చెప్పారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన ఇప్పటికీ ఉందని..ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేస్తామని రత్నం చెప్పుకొచ్చారు.