ఐఏఎస్ అధికారిగా చరణ్ ..... మెసేజ్ తో కూడిన కమర్షియల్ మూవీ అట .....??
ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. మరోవైపు ఆచార్య కూడా 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని మొదట మే 13 న విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న యూనిట్ ప్రకటించింది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ పై 50వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా అవినీతి, లంచగొండితనం, అక్రమాల నేపథ్యంలో సాగుతుందని అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ అధికారి గా కనిపించనున్నారని మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీగా దర్శకుడు శంకర్ దీనిని అద్భుతంగా తెరకెక్కించనున్నారని చెబుతున్నారు. గతంలో శంకర్ తీసిన ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, శివాజీ తరహాలో ఈ మూవీ కూడా సాగుతుందట. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతిత్వరలో వెల్లడికానున్నట్లు తెలుస్తుంది.....!!