మరోసారి రవితేజతో జతకడుతున్న రాశిఖన్నా.. ఈసారైనా హిట్టొచ్చేనా..??

Anilkumar
మాస్ మహారాజా రవితేజ ఈ ఎడాది ప్రారంభంలో క్రాక్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ని అందుకున్నాడు..  సంక్రాంతికి విడుదలైన క్రాక్ మంచి విజయాన్ని అందుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ 'క్రాక్' సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. చెప్పాలంటే వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజకు 'క్రాక్' మంచి బూస్ట్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. ఆమెకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్‌గా అవతరించింది.

ఇక క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్'లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

ప్రస్తుతం ఖిలాడి షూటింగ్ జరుపుకుంటుంటోంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్రలో మెరవనుంది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది.ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రవితేజ మరోసినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ మార్చి సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట. కాగా మొదటి హీరోయిన్'గా రవితేజ సరసన రాశీఖన్నా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎంపిక ఖరారు అయినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: