కాలభైరవ మాటలకు ఎన్టీఆర్ షాక్ అవుతాడా...?

VAMSI
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరు సంగీత దర్శకులు ఉన్నా కూడా ఎవరి ప్రత్యేకత వారిదే. సంగీతంలో ఉన్న మత్తు అలాంటిది. ఎంతో మంది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ వినసొంపైన బాణీలతో ప్రేక్షకులను ముగ్ధ మనోహరులను చేస్తుంటారు. వారిలో ఒకరే ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణి...ఈయన దర్శక దిగ్గజం రాజమౌళి బ్రదర్ కావడం విశేషం. రాజమౌళి సినిమా అంటే దానికి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటారు. అంతగా వీరిద్దరి కాంబో ఇప్పటి వరకు అన్ని సినిమాలకు ప్లస్ అయ్యింది. అయితే కీరవాణి కి ఇద్దరు కొడుకులు ఉన్నారని తేలిసిన విషయమే. ఒకరు కాలభైరవ...ఈయన సింగర్ మరియు సంగీత దర్శకుడిగా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత లో పాడిన "పెనిమిటి సాంగ్...వింటే చాలు ఇతను ఎంత ప్రతిభావంతుడు అని విషయం తెలియడానికి.  ఇంకొకరు చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తను మొదటి సినిమా  'మత్తు వదలరా' తో సినీ కెరీర్ ను స్టార్ట్ చేశాడు..ఈ సినిమాకి స్వయంగా కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడు.  ఇది ఈ సినిమా కొంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం “తెల్లవారితే గురువారం” అనే కొత్త కాన్సెప్ట్ తో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈరోజే విడుదల అయింది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు. నా తమ్మడు సినిమాలకు నేను సంగీతాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. తాను మూడో సినిమాకు కూడా నేనే సంగీతాన్ని అందిస్తాను.  అప్పుడప్పుడూ మేమిద్దరం మా సంగీతం మరియు నటన గురించి చర్చించుకోవడం అలవాటు.
రాజమౌళి గారు ఎప్పటి నుండో మాకు సినిమాకు సంబంధించిన ఇంపుట్స్ ఇస్తూనే ఉన్నారు. ఆయన సలహాలు ఎప్పుడూ పాటిస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు భైరవ. ఖచ్చితంగా నాన్న సంగీత ప్రభావం నాపై ఉందన్నారు. ఎన్టీఆర్ అంటేనాకు ప్రాణం. మా కుటుంబానికి ఆయన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటారు. మా ఇంటిలో ఒక పెద్దన్నయ్య లాగా కలిసిపోతారు. ముఖ్యంగా నేను కోసం పాడిన పెనిమిటి సాంగ్ అన్నకు ఎంతో బాగా నచ్చింది అని ఒక సందర్భంలో చెప్పారు. నా జీవితంలో ఏదైనా కోరిక ఉంది అంటే అది నేను ఎన్టీఆర్ సినిమాకి సంగీతాన్ని అందించడమే అని మనసులోని తన అభిమానాన్ని ఈ విధంగా చూపించాడు. మరి అతని కోరిక ఎన్టీఆర్ తీరుస్తాడా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: