ఆచార్య పిక్స్ లీక్.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కొరటాల..
అయితే ఇది కావాలని యూనిట్ వదిలిన పిక్ కాదని చిరు మరియు చరణ్ యొక్క ఈ పిక్ ను ఎవరో కావాలనే లీక్ చేశారని గుర్తించారు. ఈ సినిమా మీద జనాల్లో ఆసక్తి నెలకొని ఉండడంతో అది ట్రేండింగ్ లోకి కూడా వచ్చేసింది. ఈ దెబ్బకు దర్శకుడు కొరటాల శివ షాక్ అయినట్టు చెబుతున్నారు. వెంటనే ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. సెట్ లో ఉన్న పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెబుతున్నారు.
దీంతో పోలీసు శాఖ త్వరగా స్పందించి, ఈ సంఘటన మళ్లీ పునరావృతం కాదని నిర్మాతలకు హామీ ఇచ్చింది. దీంతో పోలీసు వారు ఆచార్య షూటింగ్ లొకేషన్లో భద్రతను కఠినతరం చేశారు. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్నా ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 13 న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాని మాటినీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.