ప్రభాస్ మూవీ పై నాగ్ అశ్విన్ మాటలకు షాక్ లో అభిమానులు !

Seetha Sailaja
ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి కథ ఫైనల్ కావడంతో అధికారిక ప్రకటన కూడ వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని నాగ్ అశ్విన్ చెపుతున్నప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ప్రభాస్ కు కూడ తెలియని  పరిస్థితి అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో నాగ్ అశ్విన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాను అనుకున్న కథతో ప్రభాస్ హీరోగా సినిమా ఎలా తీయాలో అర్థం కావడం లేదు అంటూ నాగ్ అశ్విన్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం తాను ప్రభాస్ తో తీస్తున్న కథ స్క్రిన్ ప్లే చాల కొత్తగా ఉంటుందని ఇండియన్ సినిమాలో ఇలాంటి కథ స్క్రీన్ ప్లే తో సినిమా రాక పోవడంతో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఈ మూవీ కధను ఎలా డీల్ చేయాలో తన యూనిట్ లో ఎవ్వరికీ అర్థం కావడం లేదు అంటూ నాగ్ అశ్విన్ అభిప్రాయ  పడుతున్నట్లు తెలుస్తోంది.  

దీనితో కొత్త కాన్సెప్ట్ తో ప్రభాస్ తో తీస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలు కావడానికి కొంత సమయం పడుతుందని అందువలనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడ ఇవ్వలేక పోతున్నట్లు నాగ్ అశ్విన్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయిన తర్వాత తన సినిమా గురించి స్పష్టమైన క్లారిటీ వస్తుంది అంటూ నాగ్ అశ్విన్ ఈ సినిమా ఆలస్యం గురించి వివరణ ఇస్తున్నట్లు టాక్.

అంతేకాదు ‘ఆదిపురుష్’ సినిమా తర్వాత తన సినిమా రావడం తనకు ప్లస్ అంటూ రాముడి కథ కాబట్టి ‘ఆదిపురుష్’ సినిమా మణిపూర్ లాంటి రాష్ట్రాలకు కూడ ‘ఆదిపురుష్’ విడుదల అవుతుందని   ఆతరువాత ప్రభాస్ కు పెరిగే మరింత క్రేజ్ తో తన మూవీ బిజినెస్ మరో 30శాతం పెరుగుతుందని  నాగ్ అశ్విన్ అభిప్రాయం. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈసినిమాలో భారతీయ సంస్కృతిని తనదైన శైలిలో చూపించాలని నాగ్ అశ్విన్ ఆశ పడుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: