మహేష్ - కొరటాల కలయికలో రానున్న మూడో మూవీ...

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు ఆయన సొంతం..ఇక గతేడాది "సరిలేరు నీకెవ్వరూ" సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 220 కోట్ల పైనే వసూళ్లు సాధించింది... ఇక  ఆ సినిమా ఇచ్చిన జోష్ తో సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది ఎలాగైనా ఒక సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా దెబ్బతో ప్లాన్ మొత్తం చేంజ్ అయ్యింది. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా 2022 సంక్రాంతికు రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమా అనంతరం మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాజమౌళితో అయితే ఒక సినిమా ఉంటుంది.

కానీ అంతకుముందు చిన్న గ్యాప్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే మహేష్ బాబు హిట్టిచ్చిన దర్శకుడితో మరోసారి కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు కొరటాల శివ. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో మహేష్ కెరీర్ లో మంచి బ్లాక్ బ్లస్టర్  హిట్స్ ఇచ్చిన  కొరటాల ఆల్రెడీ మహేష్ కు లాక్ డౌన్ లోనే ఒక స్టోరీ లైన్ వినిపించాడట. రాజమౌళి అనంతరం ఆ కథ సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.ఇక ఆ సినిమాను భరత్ అనే నేను నిర్మాత డివివి దానయ్య నిర్మించే అవకాశం ఉందట.

ఈ ఏడాది ఒక్క సినిమాతోనే బిజీగా ఉండే మహేష్ వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలతో బిజీ అయ్యి దూసుకుపోతున్నట్లు సమాచారం అందుతుంది... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: