
మెగా ఉప్పెన.... 2 రోజులకే బాక్సాఫీస్ బద్దలు
మొదటి రోజే 10 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది ఉప్పెన. పాత డెబ్యూ ఓపెనింగుల రికార్డులన్నింటికి పాత రేసింది. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా ఏకంగా మరో రు. 9 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మేరకు మైత్రీ మూవీస్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఓవరాల్గా చూస్తే రెండు రోజుల్లో ఉప్పెన నైజాంలో 5.75 కోట్లు - వైజాగ్ 2.67 కోట్లు - ఈస్ట్ లో 1.63 కోట్లు - వెస్ట్ లో 1.13 కోట్లు - కృష్ణ 1.10 కోట్లు - గుంటూరు 1.42 కోట్లు - నెల్లూరు 0.58 కోట్లు - సీడెడ్ 2.45 కోట్లు వసూలు చేసింది.
ఏపీ , తెలంగాణలో ఉప్పెనకు రెండు రోజులకు రు. 16. 73 కోట్ల వసూల్లు వచ్చాయి. విదేశాల నుంచి 70 లక్షలు - కర్ణాటక నుంచి 86 లక్షలు - తమిళనాడు నుంచి 30 లక్షలు - రెస్ట్ ఆఫ్ ఇండియా 18 లక్షలు వసూలు చేసింది. ఉప్పెన టోటల్ గా రెండ్రోజులకు 18.77 కోట్లు అంటే సుమారు 19 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా డెబ్యూ హీరోగా వైష్ణవ్ ఎన్నో రికార్డులను తిరగేసి తన పేరిట లిఖించుకున్నాడు.