"అల్లు అర్జున్ తో అలా చేయడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలు".. బన్ని పై సంచలన వ్యాఖ్యలు చేసిన దబాంగ్ బ్యూటీ..!!

Anilkumar
గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురములో సినిమా విడుదలై ఇండ్రస్టీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే..2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్ లను కొల్లగొట్టి ఇండ్రస్టీ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమాలో పాటలు, అల్లు అర్జున్ నటన, డాన్సులకి ఫిదా అయిపోయారు.. ఇక ఈ  సినిమా విడుదల అయ్యి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పనిగట్టుకుని మరీ పొగుడుతోంది బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్.
 
దబాంగ్ లో నటించిన ఈ సుందరి ఇప్పుడు అల్లు అర్జున్ ని ఎందుకు పొగుడుతోందా అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.ఓ మీడియా ఇంటర్వూలో టాలీవుడ్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ తో నటించాలన్నదే తన కోరిక అని స్ట్రయిట్ గా చెప్పేస్తోంది. అలవైకుంఠపురంలో సినిమాని చూశానని అందులో స్టైలిష్ స్టార్ డాన్స్, యాక్టింగ్ అదరహో అంటూ కితాబిచ్చింది.ఆయనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలంటోంది. ప్రస్తుతం తెలుగులో అడవిశేష్ మేజర్ , వరుణ్ తేజ్ గని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది సాయి మంజ్రేకర్. మెగా కాంపౌండ్ లో హీరోయిన్ అయితే చాలు.

 కుర్రహీరోలందరితో ఆఫర్ వస్తుందని తెలిసిపోయినట్లు ఉంది.అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ ని బుట్టలో వేస్తోంది ఈ భామ. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల డైరక్షన్ లో బన్నీ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ అనే పేరు రీసంట్ గా వినిపించింది. మరి అమ్మడి ఇంటర్య్వూని బట్టీ చూస్తే ఇది నిజమవుతుందా అనే అనిపిస్తోంది..ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: