రష్మీ, అనసూయ మధ్య గొడవ.. అందరి ముందే కొట్టుకునేంత వరకు వెళ్లారు..?
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని ఛానల్స్ కూడా న్యూ ఇయర్ ఈవెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇక ప్రతి పండుగ కు అదిరిపోయేలా ఈవెంట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తు.. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించే ఈటీవీ కూడా ఈ సారి న్యూ ఇయర్ కి మరో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఓ వైపు జబర్దస్త్ మరోవైపు డి షో లకు సంబంధించిన కంటెస్టెంట్ లను ఒక చోట చేర్చి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు ఈటీవీ నిర్వాహకులు.
ఈ క్రమంలోనే డీజే కి సంబంధించిన ప్రోమోలు వరుసగా విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఈ షోపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. కాగా ఇటీవలే విడుదలైన డీజే షో కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది..ఇక ఈ ప్రోమో లో భాగంగా ఎప్పుడూ ఎంతో క్లోస్ గా ఉండే అనసూయ రష్మీ లు స్టేజి మీద కొట్టుకున్నారు. జబర్దస్త్ నువ్వు నా నుంచి లాగేసుకున్నావు అంటే లేదు నువ్వు లాగేసుకున్నావు అంటూ ఏకంగా ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లారు. తర్వాత ప్రదీప్ కల్పించకపోవడంతో అందరూ నవ్వుకున్నారు.