అసలు మెగా, మంచు ఫ్యామిలీస్ మధ్య ఏం జరుగుతోంది..ఎప్పుడూ లేనిది ఈ హీరోలు ఎందుకు ఇలా సడెన్ గా కలుసుకుంటున్నారు..??
లోపల ఎలా ఉన్నా, పైకి ఆలింగనం చేసుకుని కన్పించడం కూడా అందరికీ తెలుసు. అలాంటిది, చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంటే, ఆ సెట్కు మోహన్బాబు స్వయంగా వెళ్లి చిరంజీవిని స్నేహపూర్వకంగా కలిశారు.చిరకాల మిత్రుడు తన సెట్కు రావడంతో చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఇద్దరూ కొద్దిసేపు వివిధ అంశాలపై మాట్లాడుకొన్నారు. అంతకు ముందే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా చిరుని కల్సి, ఎందుకు కలిసానో తర్వాత చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టాడు. ప్రస్తుతం 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటిస్తున్న మోహన్బాబు ఇంతకీ చిరుని ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారో మాత్రం బయటకు రాలేదు.
అయితే ఇప్పుడు ఇండ్రస్టీలో మెగా, మంచు ఫ్యామిలీస్ మధ్య అసలు ఏం జరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది.. ఎప్పుడూ లేనిది ఇంత సడెన్ గా ఈ హీరోలు కలుసుకోవడంపై ఇండ్రస్టీలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మరి వీళ్ళు ఇలా కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటా అని ఇండ్రస్టీలోని పలువురు సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ఆచార్య షూటింగ్ తో బిజీగా ఉన్న చిరూ.. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి...!!