'రాధేశ్యామ్' లో ప్రభాస్ అటువంటి పాత్ర చేస్తున్నారా ....??

GVK Writings
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. అంతకముందు యాక్షన్ హీరో గోపీచంద్ తో జిల్ మూవీ తీసి మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకడు రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, షా షా ఛత్రి, జయరాం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ కి పలు కమర్షియల్ హంగులు అద్ది దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నట్లు టాక్.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తుండగా ఈ సినిమాని దాదాపుగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, అలానే విజువల్ వండర్ గా కూడా ఈ సినిమా అదరగొడుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ ఒక బుక్ సెల్లర్ పాత్రలో కనిపించనున్నారని, ఆయన షాప్ కు బుక్స్ కొనడానికి ఒకానొక సందర్భంలో వచ్చిన హీరోయిన్ పూజా హెగ్డేని తొలిసారిగా చూసిన హీరో ప్రభాస్ ఆమె ప్రేమలో పడతారని, అనంతరం వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయని సమాచారం. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరి పాత్రలు అదిరిపోనున్నట్లు టాక్. మరి ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరొక ఐదు నెలల వరకు వెయిట్ చేయాల్సిందే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: