హీరోయిన్ ప్రణీత పేరు చెప్పి 13.5 లక్షలు స్వాహా...
అంతేకాదు విజయ్ దేవరకొండ పేరుతో కూడా కొందరిని మోసం చేస్తున్నారంటూ కూడా పెద్ద రచ్చ జరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా బాపు గారి బొమ్మ హీరోయిన్ ప్రణీత పేరుతో కూడా ఇద్దరు వ్యక్తులు.. బెంగుళూరుకు చెందిన ఓ బిల్డర్ నుండీ 13.5 లక్షలు వసూల్ చేసి టోపీ పెట్టారట. వివరాల్లోకి వెళితే.. మహమ్మద్ జునాయత్ మరియు వర్షా అనే ఇద్దరు వ్యక్తులు… హీరోయిన్ ప్రణీత మేనేజర్లమంటూ ఓ బిల్డర్ దగ్గర ఈ మోసానికి పాల్పడ్డారట. ‘బెంగుళూరుకు చెందిన ఓ హోటల్ లో ప్రణీత ఉన్నారు..
మీ సంస్థకు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా చేసేలా డీల్ సెట్ చేస్తాము’ అంటూ అతన్ని నమ్మించడం మొదలుపెట్టారట. అటు తరువాత ‘ప్రణీత మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యడానికి ఒప్పుకున్నారని.. మీరు రూ.13.5 లక్షలు చెల్లిస్తే హోటల్ లో ఉన్న ప్రణీత గారితో అగ్రిమెంట్ పై సైన్ చేయిస్తామని’ చెప్పి అంత మొత్తం డబ్బు తీసుకొని అక్కడి నుండీ ఎస్కేప్ అయిపోయారట. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన బిల్డర్.. బెంగుళూరు హైగ్రౌండ్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేసాడట. ప్రస్తుతం వారు దర్యాప్తు చెయ్యడం మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇక ప్రణీతకు ఈ మధ్య సినిమా ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ప్రణీత "ఎలెనా లెగ్గింగ్స్" అనే బట్టల బ్రాండ్ బిజినెస్ నడుపుతుంది.