మళ్ళీ మేడమే కావాలంటున్న బన్నీ .....??

GVK Writings
రెండేళ్ల క్రితం హరీష్ శంకర్ తీసిన డీజే సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న బన్నీ, దాని తరువాత వక్కంతం వంశీ తీసిన నా పేరు సూర్య మూవీతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నారు. ఇక ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా మంచి హిట్ కొట్టి బన్నీకి ఫైనల్ గా మంచి హిట్ ని అందించింది. ఇక ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత గీత ఆర్ట్స్ 2 బ్యానర్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ వారు ఎంతో గ్రాండ్  లెవెల్లో నిర్మించనున్న సినిమాలో బన్నీ నటించనున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతూ, ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య మూవీ తీస్తున్న కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఒక మంచి సోషల్ మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా కథను సిద్ధం చేసాడట దర్శకుడు కొరటాల. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఇటీవల పలువురు నటీమణుల పేర్లు వినిపించాయి.  

అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల బన్నీ తో కలిసి నటించిన అలవైకుంఠపురములో సినిమాలో ఆయనకు మేడమ్ పాత్రలో పూజా హెగ్డే నటించింది. అయితే ఈసారి కూడా ఆమె అయితేనే ఈ సినిమాలోని పాత్రను పోషించగలదు అని భావించి ఆమె పేరుని దర్శకుడు కొరటాలకు బన్నీ సూచించినట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం బన్నీ, పూజా హెగ్డే ల జోడీ ని మరొక్కసారి తెరపై చూడవచ్చన్నమాట .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: