అందుకే ఆ హీరోలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదట..!

Suma Kallamadi
ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకున్నారు. వినాయక చవితి తో పాటు చిరంజీవి పుట్టినరోజు కూడా ఒకే రోజు రావడంతో సినీ అభిమానులకు రెండు పెద్ద పండుగలు ఒకేసారి వచ్చాయి. నిన్న అన్ని సామాజిక మాధ్యమాలలో చిరంజీవి ఫోటోలు, వీడియోలతో నిండిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. లక్షల మంది అభిమానులు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, విజయసాయిరెడ్డి, మీనా, భూమిక చావ్లా, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,  నాగార్జున, కార్తికేయ, నాని, రామ్, కాజల్ అగర్వాల్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ ప్రముఖులందరూ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు.


ప్రస్తుతం ప్రభాస్ పాపులారిటీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. అతను తీస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం కూడా తెలుగులో కాకుండా నేరుగా హిందీలోనే తెరకెక్కిస్తున్నారు ప్రభాస్. ఈ బాహుబలి స్టార్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని... అందుకే అతను తెలుగు ఇండస్ట్రీకి అంటి ముట్టనట్టు గా ఉంటున్నారని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇందులోని భాగంగానే చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపలేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాకపోతే ప్రభాస్ నేరుగా చిరంజీవి కి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఉండవచ్చునని భావిస్తున్నారు.


ఇకపోతే విజయ్ దేవరకొండ అందరూ ఫాలో అయ్యే ట్రెండ్ ని అస్సలు ఫాలో అవ్వరు. అందుకే సోషల్ మీడియా సముద్రంలో చిరంజీవికి అంది అందని శుభాకాంక్షలు తెలిపిన చేతులు దులుపుకోవడం ఇష్టంలేక చిరంజీవికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: