ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు.. సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ పోస్ట్‌

JSR
ఉత్తరాది యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని  30 రోజులు గడుస్తున్న ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణించిన నెల రోజులు అయిన నేపథ్యంలో సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దివంగత నటుడితో తన అనుబందాన్నిగుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన ఫీలింగ్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటు ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ పోస్ట్ చేసింది.

`ఇప్పటికీ నా ఫీలింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నా.. గుండెల్లో కోలుకోలేని నిశబ్దం ఆవరించింది.` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో సుధీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. సుశాంత్, రియాలు చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. సుశాంత్‌ డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్న సమయంలో రియానే అతడికి తోడుగా ఉంది. త్వరలో తెరకెక్కబోయే సుశాంత్ సినిమాలో రియా హీరోయిన్‌గా నటించేందు ఓకె చెప్పింది కూడా.

`నాకు ప్రేమ మీద నమ్మకం కలగడానికి, ప్రేమ గొప్పతనం అర్థం చేసుకోవడానికి నువ్వు కూడా ఒక కారణం. ఓ మాథ్స్‌ ఈక్వెషన్‌ ద్వారా జీవితం ఎంత గొప్పదో చెప్పావు. నీతో ఉన్నన్ని రోజులు ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాను. ఇప్పుడు నువ్వు మరింత ప్రశాంతమైన స్థానంలో ఉన్నావని భావిస్తున్నా` అంటూ తన ఆవేదను అక్షర రూపంలో అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్‌పై సుశాంత్‌ అభిమానులు కూడా స్పందిస్తున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Still struggling to data-face my emotions.. an irreparable numbness in my {{RelevantDataTitle}}