ఈ సినిమా ల సంగతి తేల్చండి మహాప్రభో అంటున్న టాలీవుడ్ ప్రేక్షకులు !

KSK
మహమ్మారి కరోనా వైరస్ రాకతో పరిస్థితులని తారుమారయ్యాయి. చాలా రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సినిమా రంగానికి కరోనా వైరస్ ఈ ఏడాది భయంకరమైన నష్టాలను మిగిల్చింది. సరిగ్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్ సమయంలో చాలామంది బడా నిర్మాతలు సెలవులను క్యాష్ చేసుకోవడానికి ముందు నుండి ప్లాన్ చేసుకుని మరీ భారీ ఎత్తున సినిమాలను నిర్మించడం జరుగుతుంది.

ఆ విధంగానే జరిగిన ఈ యేడాది కరెక్ట్ గా సమ్మర్ స్టార్ట్ అయ్యే సమయానికి పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సిన టైంలో మహమ్మారి కరోనా రావటంతో దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళటం తో సినిమా ధియేటర్లు క్లోజ్ కావటంతో పాటు షూటింగ్ లు జరగకపోవడంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు అంతా మూలనపడ్డాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ రాకముందు మంచి క్రేజ్ ఉన్న సినిమాలుగా నిశ్శబ్దం, రెడ్, మాస్టర్, వి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఒరేయ్ బుజ్జి గా, ఉపెన లాంటి సినిమాలు బాగా హడావిడి చేశాయి. మరి ఇప్పుడు ఈ సినిమాల పరిస్థితి ఏంటి మహాప్రభో అని టాలీవుడ్ ప్రేక్షకులు గోల చేస్తున్నారు.

థియేటర్లో కాకపోయినా కనీసం ఓటిటి లో అయినా రిలీజ్ చేయాలని కోరుతున్నారు. దాదాపు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి రిలీజ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాలను ఎలాగైనా రిలీజ్ చేయాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుతున్నారు. మరోపక్క ఈ సినిమాల నిర్మాతలు థియేటర్లో కాకుండా ఓటిటి ప్లాటుఫార్మ్ లో రిలీజ్ చేస్తే లాభం ఏమీ ఉండదని ఆలోచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: