అక్కినేని సమంత, దీపిక పదుకొణే ఎవరి విషయంలో గొడవ పడుతున్నారో తెలిస్తే పిచ్చెక్కాల్సిందే ..!
రీసెంట్ గా జాను సినిమాతో భారీ ఫ్లాప్ ని చూసింది అక్కినేని సమంత. కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా గా నిలిచిన 96 కి రీమేక్ గా దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా కోలీవుడ్ లో త్రిషకి మంచి కం బ్యాక్ మూవీ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా తో మళ్ళీ త్రిష ఫుల్ ఫాం లోకి రావడమే కాకుండా సీనియ స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటుంది. అందుకే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో దిల్ రాజు సమంత ని ఒప్పించి మరీ జాను లో నటింపజేశాడు. కానీ బ్యాడ్ లక్ ఇద్దరికి జాను గట్టి షాకిచ్చింది. వాస్తవంగా సినిమాకి అందులో సమంత నటనకి మంచి పేరు వచ్చినప్పటికి కలెక్షన్స్ పరంగా మాత్రం భారీ లాస్ అని తేలిపోయింది.
ఇక దేశవ్యాప్తంగా సౌత్, నార్త్ సహా అన్ని భాషల్లోను బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. వివిధరంగాల్ని ప్రభావితం చేసిన ప్రముఖుల జీవితాలు వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి ని తెరకెక్కించారు. అలాగే ఎన్.టి.ఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించారు. ఈ నేపథ్యంలో సమంత....ప్రముఖ కర్ణాటక గాయని, నర్తకి, సాంస్క్రతిక ఉద్యమకారిణి, దేవదాసి.. బెంగళూరు నాగరత్తమ్మ జీవిత కథలో నటించబోతున్నట్లు తాజా సమాచారం. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
కర్ణాటక సంగీత ప్రాచుర్యానికి విశేష కృషిచేయడంతో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ఆద్యురాలిగా నాగరత్తమ్మ గొప్ప కీర్తి ని సాధించారు. అంతేకాదు మహిళా హక్కుల కోసం పోరాడారు. స్పూర్తిదాయకంగా సాగిన ఆమె జీవిత కథను నేటి తరాలకు తెలియజేసేందుకు భారీ స్థాయిలో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమాలో ముందు సమంత ను అనుకున్నప్పటికి పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలంటే దీపికా పదుకునే సమంత కంటే బెటర్ ఛాయిస్ అని చర్చించుకుంటున్నారట.
అయితే ఈ కథ మాత్రం సమంత, దీపిక ల ఇద్దరికి విపరీతంగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాని ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో ప్రస్తుతానికి సస్పెన్గా ఉండగా సింగీతం తో మాత్రం ఒకరిని మించి ఒకరు నేను చేస్తా అంటే నేను చేస్తా అంటూ సమంత దీపైక పోటి పడుతున్నారట. ఇక ఎవరు ఫైనల్ అవుతారో కొద్ది రోజుల్లో వెల్లడి కానుంది.