బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. బాహుబలి హిందీలో కూడా సూపర్ హిట్ కావటంతో ప్రభాస్తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా క్యూ కట్టారు. బాహుబలి తరువాత ప్రభాస్తో సినిమా చేసేందుకు కరణ్ జోహర్ ప్రయత్నాలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ కరణ్ ఆఫర్ను రిజెక్ట్ చేశాడన్న ప్రచారం గట్టిగానే వినిపించింది. బాహుబలి సక్సెస్ తరువాత తన మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని సాహో సినిమా చేశాడు ప్రభాస్.
భారీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన సాహోకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా కమర్షియల్గా సక్సెస్ అయ్యింది. దీంతో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లోనే చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభంమైంది.
అయితే గతంలో బాలీవుడ్ దర్శకుడు క్వీన్ ఫేం వికాస్ భల్, ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కే ఈ సినిమా కథకు ప్రభాస్కు కూడా దాదాపుగా ఓకె చెప్పాడట. అయితే తన ఇమేజ్కు తగ్గట్టుగా సినిమాలో యాక్షన్ సీన్స్ను యాడ్ చేయాలని ప్రభాస్ కోరటంతో వికాస్ ఆలోచనలో పడ్డాడు.
కథ పరంగా యాక్షన్కు అవకావం లేకపోవటంతో ప్రభాస్కు అదే విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ప్రభాస్ మాత్రం ఫైట్స్ ఉండాలని పట్టుబట్టడంతో వికాస్ ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడట. వికాస్ లాంటి క్రియేటివ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా వద్దనుకోవటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: