జోరు పెంచిన తెలుగు అమ్మాయి..
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది ఇతర భాష హీరోయిన్లు వస్తున్న విషయం తెలిసిందే. మాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు తెలుగు లో తమ సత్తా చాటారు. ఇక బాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్ల సంగతి చెప్పనవసరంలేదు. ఈ మద్య కన్నడ నుంచి కూడా వరుసగా హీరోిన్లు వస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు మాత్రం చాలా తక్కువ గా వస్తున్నారు. అందం, అభినయం ఉన్నా కొంతమందికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల తెలుగు లో రాణించలేకపోతున్నారని అంటున్నారు. కానీ చాలా మంది తెలుగు హీరోయిన్లు ఇక్కడి దర్శక, నిర్మాతలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అంటున్నారు.
తాజాగా 'పెళ్లి చూపులు' తర్వాత రీతు పాపులర్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. తెలుగింటి అమ్మాయి అయిన రీతూ వర్మ.. ఈ చిత్రం తర్వాత రీతూ వర్మకు మంచి అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు.. ఇక తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్తుందేమో అనుకుంటున్న సమయంలో మూడు సినిమాలు పట్టేసి బిజీ హీరోయిన్ అయిపొయింది. కానీ ఈ అమ్మడికి ఈ మద్య వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్వెల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ లేటెస్ట్ గా నాని టక్ జగదీశ్ లో ఛాన్స్ కొట్టేసింది.
నిన్న నాగ శౌర్య తో సౌజన్య అనే మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్న చిత్రంలో రీతు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇలా మూడు చిత్రాలతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకులను పలకరించి మినిమం రేంజ్ ఉన్న హీరోయిన్స్ లిస్టులోకి వెళ్ళబోతుంది. మొత్తానికి రీతూ వర్మ వరుస ఛాన్సులు కొట్టడంతో అవి మంచి విజయాలు అందుకుంటే స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.