కండీషన్స్ అప్లై అంటున్న రాములమ్మ?

siri Madhukar

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది లేడీ అమితాబ్ విజయశాంతి. స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ పాత్రలో ఎక్కువగా నటిస్తూ లేడి అమితాబ్ గా పేరు తెచ్చుకుంది.  ఎక్కువగా లేడీ ఒరియెంట్ పాత్రల్లో ఎక్కువ నటించడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ కావడంతో ఆమె సినిమాల్లో నుంచి తప్పుకున్నారు. ఒసేయ్ రాములమ్మ" సినిమాతో తనకు రాములమ్మ అనే ముద్దుపేరును కూడా పెట్టేసారు తన అభిమానులు.  అదే సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదట బీజేపీ తర్వాత టీఆర్ఎస్.. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.  అయితే సినిమాలకు దూరమైన తర్వాత విజయశాంతి దాదాపు పదమూడు సంవత్సరాలు దూరంగా ఉంటూ వచ్చారు.

 

ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు ’ లో విజయశాంతి కీలక పాత్రలో పోషించింది.  ఆమె పదమూడేళ్ల తర్వాత ఆమెను నటింపజేయటానికి అనీల్ రావిపూడి ఎంతో కష్టపడ్డట్టు పలు ఇంటర్వ్యూలో తెలిపారు.   అయితే ప్రస్తుతం విజయశాంతి గురించిన ఒక వార్త ఒకటి ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం ఏంటంటే.. తాను తదుపరి సినిమాల్లో నటించడానికి కొన్ని షరతులు పెట్టిందట. అవేంటంటే స్టార్‌ యాక్టర్స్‌ లో మాత్రమే తాను నటిస్తానని, స్టార్‌ యాక్టర్స్‌తో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని విజయశాంతి చెప్పినట్లు పుకారు చికారు చేస్తుంది. 

 

అంతే కాదు ఆమె నటించిన ప్రతి సీన్ సినిమాల్లో ఉండాలని.. ఏ సీన్ కూడా కట్ చేయడానికి వీలు లేదని కండీషన్ పెట్టారట.  ఇక చిన్న హీరోలు.. అప్ కమింగ్ నో చెప్పినట్లు టాలీవుడ్ టాక్.  మొత్తానికి పదమూడేళ్ల తర్వాత కూడా విజయశాంతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని..  సరిలేరు నీకెవ్వరు హిట్ తో తేలిపోయింది. దాంతో ఆమెకు టాలీవుడ్ లో మరింత డిమాండ్ పెరిగిపోయిందని అంటున్నారు.  అయితే ఇవి రూమర్లు అని.. వీటిపై ఆమె ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని.. ఒకవేళ రూమర్లపై ఎలా స్పందిస్తారో చూడాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: