దర్బార్: దిశ కేసు... వాళ్లపై రజనీ మార్క్ సెటైర్లు.. ?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశ్య అత్యాచార, హత్య కేసు. నలుగురు కామాంధులు వెటర్నరీ డాక్టర్ అయిన దిశ ను మాయ మాటలతో మ్యభపెట్టి ఒక్కసారే ఆమెను ఎత్తుకు వెళ్లి పొదల్లో దారుణంగా అత్యాచారం చేశారు. ఆమెకు బలవంతంగా మద్యం తాపించి మరీ అత్యాచారానికి పాల్పపడ్డారు.. తర్వాత ఆమెను దహనం చేశారు. దిశకు జరిగిన అన్యాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో చిన్నా పెద్దను కదిలించి వేశాయి.. ఆమెకు జరిగిన అన్యాయానికి పెద్దు ఎత్తున ఉద్యమం చేశారు. నలుగురు నింధితులకు ఉరి శిక్ష వేయాలని.. పదిమందిలో కాల్చి వేయాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో నలుగురు నింధితులను హత్య జరిగిన స్పాట్ లో విచారణ చేస్తున్న సమయంలో పోలీసు వద్ద నుంచి ఆయుధాలు తీసుకొని వారిపై దాడి చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో వారిని ఎన్ కౌంట్ చేయాల్సి వచ్చిందని పోలీస్ అధికారి తెలిపారు. అయితే దిశ నింధితులను ఎన్ కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా పోలీసులపై హర్షాతి రేఖలు వెల్లువిరిసాయి.. అలాంటి కసాయిలకు తగిన శిక్ష విధించారని మెచ్చుకున్నారు. కానీ అదే సమయంలో మానవహక్కుల సంఘాల హడావిడి ఏ రేంజ్ లో చేశారో తెలిసిందే. తాజాగా ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్భార్’ మూవీ రిలీజ్ అయ్యింది.
ఇందులో రజనీ దర్బార్లో ఓ ఎన్కౌంటర్ చేశాడు. దీనిపై మానవహక్కుల సంఘాలు వచ్చి దీనిపై అనుమానాలు ఉన్నాయిని చెపుతారు. కాలిస్తే మానవహక్కుల సంఘాలు వచ్చయి వాళ్లనే కాలిస్తే అంటాడు ఓ ఆఫీసర్ను సీసీ కెమేరా పక్కకు తిప్పించి మరీ చెంపమీద కొడతాడు.. అంటే ప్రజలు మెచ్చే పని చేస్తే.. మానవహక్కుల సంఘాలు హడావుడి ఎంత వరకు సమంజసం అని దర్శకుడు చెప్పకనే చెప్పారు. ఇదే టాక్ బయట జనాల్లో కూడా దిశ కేసు విషయంలో తలెత్తింది. పోలీసులు తీసుకున్న నిర్ణయానికే మెజార్టీ ప్రజలు జై కొట్టారు.