టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న రకూల్ కి ఇటీవల తెలుగు ఛాన్సులు దగ్గిపోతున్నాయి. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు2’సినిమాలో నటిస్తుంది.
సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏ హీరోయిన్ కి కొత్త హీరోయిన్లతో పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రకూల్ కి ఇప్పుడు వరుసగా కొత్త హీరోయిన్లు షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు రకుల్ క్రేజ్ ని క్రాస్ చేస్తూ పూజా హెగ్డే , రష్మిక మందన్న టాలీవుడ్ లో బిగ్ ఆఫర్లు దక్కించుకుంటున్నారు.. రకుల్ ప్లేస్ ని ఆల్ రెడీ పూజా హెగ్డే ఫీల్ చేసే పనిలో బిజీ గా ఉంది. పూజా హెగ్డే కి వరుస విజయాలు దక్కడంతో ఈ హాట్ బ్యూటీ వైపు దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.
గీత గోవిందంలో కన్నడబ్యూటీ రష్మిక ఫర్మామెన్స్కు ఫిదా అయిన హీరోలు ఈ బ్యూటీతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలతో నటిస్తున్న ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్తో బీష్మ సినిమాలో నటిస్తోంది. ఈ ఇద్దరి హీరోయిన్స్ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి చెక్ పెట్టి ఉన్న ఛాన్సులన్నీ ఎగరేసుకు పోతున్నట్లు తెలుస్తుంది.