ఈ మద్య అడల్ట్ కాంటెంట్ సినిమాకు హర్రర్, కామెడీ జొప్పించి తీస్తున్న విషయం తెలిసిందే. కంటెంట్ కాస్త బాగుంటే..సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నాయి. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు బాగానే వస్తున్నాయి. తెలుగు లో అప్పుడప్పుడు వస్తున్న ఈ సినిమాలు పెద్దగా హిట్ కాకున్నా కలెక్షన్లు మాత్రం పరవాలేదు అనిపిస్తున్నాయి. తాజాగా యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంటదమ్మో.. మా అమ్మకి చెబుతా.. మీటు’ అంటూ విడుదలై సంచలనం సృష్టించిన ‘ఏడుచేపల కథ’ హక్కులు ఫ్యాన్సీ రేటు పలికాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ హాట్ హాట్ గా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఈ సినిమాకి సంభందించి వరల్డ్వైడ్ ధియెట్రికల్ రైట్స్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు సొంతం చేసుకున్నాడు. ఈ టీజర్కి యూట్యూబ్లో అన్ని ఛానల్స్ కలిపి 18 మిలియన్స్ (దాదాపు కొటి ఎనభై లక్షల మంది ) వ్యూస్ రావటం అతిపెద్ద రికార్డుగా నిలిచి సంచలనం సృష్టించింది. అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ సినిమాలో అభిషెక్ రెడ్డి తొ పాటు బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ...ఈ చిత్ర టీజర్కి వచ్చిన రెస్పాన్స్ సంతోషాన్ని చ్చింది. ఈ తరహా టీజర్ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. అడల్డ్ కామెడీ జోనర్లో రూపొందించిన ఈ చిత్రం వరల్డ్వైడ్గా హక్కులు మేము సొంతం చేసుకున్నాము. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ‘ఏడు చేపల కథ’ నడుస్తుంది. త్వరలో ఈ సినిమా మరో టీజర్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు.