నిర్మాతలను భయపెడుతున్న రాజ్ తరుణ్
ఇక ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’మూవీని ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ కాగా…ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని హీరో సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ మూవీ గురించి అందరికి చేరుతుంది. గతంలో రాజ్ తరుణ్ నటించిన చిత్రాలకి దర్శకులు, నిర్మాతలు ప్రమోషన్ బాధ్యతలను తీసుకుంటే ఇప్పుడు మాత్రం ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ మూవీకి రాజ్ తరుణ్ బాధ్యతలను తీసుకున్నాడు.
నిర్మాత, దర్శకుల కంటే బాగా ఆలోచించి తనదైన శైలిలో ప్రమోషన్ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేశారు. రాజ్ తరుణ్ చూపిస్తున్న ఆసక్తికి నిర్మాతలు సైతం ఆశ్ఛర్యపోతున్నారని అంటున్నారు. ఇక ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’సర్టిఫికేట్ పొందింది. `యు/ఎ` సర్టిఫికేట్ను పొందిందని ఈ సినిమా మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్ఛుతుందనేది చిత్రయూనిట్ లో ఉన్న నమ్మకం. ఈ మూవీలో ఉన్న స్పెషల్ ఏంటంటే….ఓ స్పెషల్ సాంగ్లో హంసనందిని అదరగొట్టిందని అంటున్నారు. రాజ్తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ ఈ మూవీలో నటించారు.