బాలకృష్ణకు మరో అవమానం
తాజాగా రిచా గంగోపాధ్యాయనీ అడిగారట. కానీ... నాకంత టైమ్ లేదు... అని చెప్పి తప్పించుకొందట. మిర్చి తరవాత మరో సినిమా రాలేదు రిచాకి. నాగ్ తో భాయ్లో నటిస్తోంది. రిచా చేతిలో ఉన్న సినిమా అదొక్కటే. పైగా పేరున్న కథానాయిక కూడా కాదు. అలాంటి రిచానే నో అంటోందంటే బాలయ్యకు అది అవమానం కిందే లెక్క. పాపం...
ఎంత కష్టం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.దాంతో రూలర్ నిర్మాతలు ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకొన్నారు. కొత్త కథానాయికలకు ఛాన్స్ ఇవ్వాలని. తమిళం, మలయాళంలో కాస్త అందంగా ఉండి, గుర్తింపు తెచ్చుకొన్న నాయికలెవరు.?? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. గప్ చుప్గా హైదరాబాద్లో ఫొటో షూట్లు కూడా జరుగుతున్నాయి.