హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
వంగవీటి సినిమా కోసం విజయవాడకు వచ్చిన సంచలనాల రామ్ గోపాల్ వర్మ ఒకవైపు తాను తీయబోయే సినిమాకు సంబంధించి విజయవాడకు సంబంధించిన కొందరు ప్రముఖులను కలుస్తూనే మధ్యలో వర్మ గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లాడు. అక్కడ స్థానిక కేఎల్‌ యూనివర్సిటీలో విద్యార్థులతో రాంగోపాల్‌వర్మ ముఖాముఖి నిర్వహించాడు. 

ఈ ముఖాముఖిలో విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి ఆ విధ్యార్ధుల మైండ్ బ్లాంక్ చేసాడు. తన గొంతు పై యముడు కత్తి పెట్టినా తాను ‘అన్నమయ్య’ లాంటి సినిమాను తీయలేను అని అంటూ తనకు దేవుడు పై నమ్మకం కాని భయం కాని లేవు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అంతేకాదు తానే ఒక దేవుడుని అని వర్మ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు.  ఇదే సందర్భంలో తానుతీయబోయే వంగవీటి సినిమా గురించి మాట్లాడుతూ  మహాభారతంలో జరిగిన హింసకంటే విజయవాడలో జరిగిన హింస ఎక్కువని అందువల్లనే తనకు ‘వంగవీటి’ సినిమా పై అంత మోజు అన్న విషయాన్ని బయట పెట్టాడు వర్మ. ఇక ప్రస్తుత సినిమాల గురించి మాట్లాడుతూ హీరోయిన్లకు బట్టలేసి చూపించడం కన్నా, బట్టలు లేకుండా చూపించేందుకే ఖర్చు ఎక్కువ అవుతోందని అంటూ నేటి గ్లామర్ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ పై సెటైర్లు వేసాడు వర్మ.

ఈ వార్తలు ఇలా ఉండగా తాను తీయబోతున్న వంగవీటి సినిమా కోసం మూడు రోజులు విజయవాడలో ఉంటాను అని వచ్చిన వర్మ కేవలం ఒక్కరోజులోనే విజయవాడ నుండి తిరిగి ప్యాకప్ అయిపోయాడు. వంగవీటి రంగ కుటుంబ సబ్యుల నుంచి మాత్రమే కాదు విజయవాడలోని ఏ ప్రముఖ రాజకీయ వేత్త నుండి కూడ వర్మ ప్రయత్నాలకు సరైన స్పందన లేకపోవడంతో వర్మ తిరిగి రివర్స్ గేర్ లో వెళ్ళిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఏమైనా వర్మ చేసిన కామెంట్స్ హీరోయిన్స్ అసలు పట్టించుకుంటారా అన్నదే ప్రశ్న..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: