మనీ: ఇలా చేస్తే మీ డబ్బు ఆదా అయినట్టే..!

Divya
పెట్టుబడి విషయంలో మహిళలు ఎప్పుడూ కూడా వెనుకబడి ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే పెట్టుబడిపై ప్రజలలో ఇప్పుడు భయం చాలా సర్వసాధారణం అయిపోయింది. అన్ని పెట్టుబడులు సురక్షితం కాదు అలాగే పెట్టుబడి పెట్టడానికి ఏది సరైన సమయమో ముందుగా తెలుసుకోవాలి.. ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మహిళలు కూడా పెట్టుబడి పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఈ పెట్టుబడి అత్యవసర సమయాలలో తప్పకుండా ఉపయోగపడుతుంది అయితే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే అంశాలపై నిపుణులు కూడా సలహాలు ఇస్తున్నారు. కాబట్టి వీటిని మహిళలు తూచా తప్పకుండా పాటించినట్లయితే సక్సెస్ మీదే అని చెప్పవచ్చు.
మహిళలు పెట్టుబడి ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయానికి వస్తే.. చాలాసార్లు మహిళలు ఫైనాన్షియల్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి భయపడుతూ ఉంటారు.  అయితే పరిశోధన ఇంకా నిపుణుల సలహాతో మీరు సులభంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.  దీనిని స్మార్ట్ మనీ డిసిషన్ అని అంటారు. ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక మహిళ తక్కువ జీతం ఖర్చులకు ఉద్యోగానికి వెళ్తున్నట్లయితే ఆ కారణంగా పెట్టుబడి పెట్టడానికి మహిళలు వెనుకడుగు వేస్తారు.  ముందుగా మీరు మీ ఖర్చులను ట్రాక్ చేసి మీ జీతంలో 10% పెట్టుబడిగా పెట్టుకోవాలి.. ఇక ఇప్పుడు డబ్బు చేతికి రాదని భావించి మీరు పొదుపు చేయడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు..
మరొకవైపు ప్రతి ఉద్యోగానికి బడ్జెట్ను మీరు సిద్ధం చేసుకుని ఆ ఉద్యోగానికి వెళ్లాలి.  అప్పుడే ప్లాన్ ప్రకారం మీరు ఖర్చు చేయడానికి వీలవుతుంది నెల ప్రారంభంలోనే బడ్జెట్ కు సిద్ధమైతే పని చాలా సులభం అవుతుంది. ఆర్థిక భద్రత కావాలి అంటే మీ డబ్బులో 10% హాజరు చేయడం వల్ల మీకు మంచి ఆదాయం లభిస్తుంది. పొదుపు చేయడం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమని ఆలోచించాలి అలాగే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ముందడుగు వేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: