మనీ: రూ.399 తో రూ.10 లక్షలు ఆదాయం . పోస్టల్ శాఖ బంపర్ ఆఫర్..!

Divya
సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు అధునాతన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాన్ని అందించే విధంగా దూసుకుపోతోంది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వార్షిక ప్రీమియం రూ. 399 తో రూ.10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఇప్పటికే ప్రమాద బీమా కింద ఎన్నో కంపెనీలు కస్టమర్లను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోని తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా తపాల శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇందులో 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఎవరైనా సరే ఈ పథకంలో చేరవచ్చు. ఇకపోతే ఈ విషయాన్ని అనంతపురం జిల్లా పోస్టల్ సూపరిండెంట్ పీవీఎల్ఎన్వీ బాల సత్యనారాయణ వెల్లడించారు.


బీమా దారుడు ప్రమాదంలో గాయపడి .. కాళ్లు,  చేతులు పోగొట్టుకున్నా సరే రూ. 10 లక్షల బీమా వర్తిస్తుంది. ఒకవేళ మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమాను అందించనున్నారు.  అలాగే రూ. 299కి కూడా ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్లుగా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కూడా బాల సత్యనారాయణ కోరారు. ఇకపోతే రూ. 399 తో కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే..  ప్రమాదవశాస్తూ మరణించిన లేదా శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా..  పక్షవాతానికి గురైనా  సరే రూ.10 లక్షలు చెల్లిస్తారు.  ముఖ్యంగా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు ఇన్ పేషెంట్ కింద రూ.60 వేల వరకు చెల్లిస్తారు.


అంతేకాదు ఇద్దరూ పిల్లల చదువుల కోసం గరిష్టంగా రూ.1 లక్ష రూపాయలు విద్యా ప్రయోజనం కింద చెల్లిస్తారు.  అంతేకాదు అవుట్ పేషెంట్ గా వెళితే ఒక రోజు మినహాయించి పది రోజుల వరకు రూ. 10, 000 చెల్లిస్తారు.  ఒకవేళ బీమా దారుడు 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైతే 25వేల రూపాయలను రవాణా కోసం,  అదనంగా అంత్యక్రియల కోసం రూ.5 వేలు చొప్పున చెల్లిస్తారు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ బీమా పథకం ప్రతి ఒక్కరికి లాభదాయకమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: