మనీ: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రం శుభవార్త..!!

Divya
ఆడపిల్ల పుట్టింది అంటే చాలు.. చాలా మంది భయపడిపోతూ ఉంటారు.. ఎందుకంటే వారి చదువులకు.. బట్టలకు పెళ్లికి కట్నకానుకలకు ఇలా ఆడపిల్ల పుట్టింది మొదలు ప్రతి చిన్న విషయంలో కూడా అధిక డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇలాంటి ఖర్చులు సామాన్యుడికి భారం అవుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కింద ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇకపోతే సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉండడం విశేషం . ఇక ఈ పథకం కింద ఏడాదికి ఒకసారి సవరించిన దానిని కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటిస్తూ ఉండడం.
ఈ పథకంలో 10 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడపిల్లలు చేరడానికి అర్హులు అవుతారు. నెలకు వెయ్యి రూపాయల చొప్పున 14 సంవత్సరాల పాటు చెల్లించినట్లు అయితే 21 యేళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో 14 సంవత్సరాలలో మీరు రూ.1,68,000  రూపాయలను ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇక 7.6 శాతం సంవత్సర వడ్డీతో కలుపుకొని సుమారుగా రూ. 4 లక్షలకు పైగా మీరు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడిగా 14 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల 21 సంవత్సరం వచ్చేసరికి వడ్డీ కలుపుకొని రూ.9,63,429 లభిస్తుంది.
కనిష్టంగా 250 రూపాయలు మొదలుకొని గరిష్టంగా రూ.1.5  లక్షల వరకు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు. ఇక ఆడపిల్ల యొక్క బంగారు భవిష్యత్తుకు ఇప్పటినుంచి బాటలు వేస్తే ఆమె భవిష్యత్తులో ఒకరిపై ఆధారపడకుండా సంతోషంగా జీవించగలుగుతారు. ఆడ పిల్లలకు ఇచ్చే గౌరవం ఇంతకన్నా మరొకటి ఉండదు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచే ఆడపిల్ల భవిష్యత్తు తగిన బాటలు వేయాలి అని ప్రభుత్వాలు కూడా ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: