మనీ: వడ్డీ రేట్లు పెంచుతూ ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.20 శాతం వడ్డీ ఉంది.. దానిని ఎస్బిఐ తీసుకున్న నిర్ణయంతో 3.30 శాతానికి పెరగనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.6 శాతంగా ఉండగా దానిని 3.8 శాతానికి పెంచింది. సంవత్సరం నుంచి పది సంవత్సరాల టెన్యూర్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి దానిని ఇప్పుడు 3.60 శాతానికి పెంచడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
2 ఏళ్ల నుంచి 3 యేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచి 5.20 శాతానికి తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ గడువు ఉన్న డిపాజిట్లకు వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఇలాంటి డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీని మీరు పొందవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో మొత్తంగా 5.50 శాతానికి చేరింది.