మనీ : ఏటీఎమ్ వినియోగదారులకు శుభవార్త తెలిపిన బ్యాంకులు ..!

Divya
చాలామంది డబ్బులు విత్ డ్రా చేయాలన్నా లేదా ఇతరులకు బదిలీ చేయాలి అన్నా, తప్పకుండా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చాలామంది బ్యాంకులకు వెళ్లడం వల్ల అధికారులకు ఇబ్బంది ఏర్పడడంతో క్యూలో నిలబడమని చెబుతూ ఉంటారు.ఇలా గంటల తరబడి క్యూలో నిలబడటం వల్ల ఓపిక నశిస్తుంది.మీ సమయం కూడా వృధా అవుతుంది. అందుకే బ్యాంకులు సరికొత్తగా ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏటీఎం సెంటర్లలో డబ్బులు బదిలీ చేయాలి అంటే తప్పకుండా మనకు చార్జ్ అనేది పడుతుంది.
అంతేకాదు ఎన్ని సార్లు డబ్బులు ఇస్తే , అన్ని సార్లు చార్జీ లు మన ఖాతా నుంచి కట్ అవడం గమనార్హం. అయితే ఇప్పుడు అలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు ఒక బ్యాంకు ముందుకు వచ్చింది. అంతే కాదు ఎన్ని సార్లు డబ్బులు తీసిన, అలాగే బదిలీ చేసినా కూడా ఎటువంటి పైసా కూడా ఖర్చు అవ్వదట.అదేంటో  పూర్తిగా తెలుసుకుందాం.
ఉజ్జీవన్  స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  .. ఈ బ్యాంకులో కనుక మీకు ఖాతా ఉన్నట్లయితే ఏటీఎం ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్ లను జరిపినా  కూడా ఎటువంటి చార్జీలు కూడా కట్  చేయమను సూచిస్తోంది. ఇక అంతే కాదు ఏటీఎంలలో ఎన్నిసార్లు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినా లేదా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి పరిమిత ట్రాన్సాక్షన్ అలాగే డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. సాధారణంగా కొన్ని బ్యాంకులు అయితే కొంత వరకు మాత్రమే లిమిట్ ను విధిస్తాయి. ఇక లిమిట్ దాటిన తర్వాత కచ్చితంగా డబ్బులు కట్ చేసుకోవడం జరుగుతుంది .

అయితే ప్రస్తుతం ఉజ్జీవన్  స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ ను  ప్రకటించడం గమనార్హం. మీరు కూడా ఈ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నట్లయితే డెబిట్ కార్డు ద్వారా డబ్బు బదిలీ చేయవచ్చు అలాగే విత్ డ్రాయల్ కూడా చేసుకునే వెసులుబాటును కల్పించింది.అంతేకాదు ఈ విషయాన్ని  తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడంతో ఇక ఇది నిజమేనని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: