ఈ రక్షాబంధన్ కు భారీ ఆఫర్ ప్రకటించిన ఎస్బిఐ..

Divya
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ రక్షాబంధన్ కు ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో మార్కెట్ లో స్వీట్లు ,పువ్వులు ,రక్షాబంధన్ లో ఇలా రకరకాల వాటిపై ఆయా వ్యాపారస్తులు ఆఫర్లు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా ఈ నేపథ్యంలోనే దేశీయ బీమా దిగ్గజ సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను అలాగే పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే రక్షాబంధన్ పండుగకు ఎస్బిఐ ఒక భారీ ఆఫర్ ను ప్రకటించడం గమనార్హం.
దేశీయ దిగ్గజ సంస్థ sbi yono app ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు తోబుట్టువులు రక్షాబంధన్ కడితే, ఆ  సోదరులు తమ  తోబుట్టువులకు ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటారు. ఇక ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోసమే ఎస్బిఐ ఒక గొప్ప ఆఫర్ ను  ప్రకటించింది. అదేమిటంటే , ఫెర్న్స్ అండ్ పెటల్స్  నుండి రూ.999 విలువ వరకు ఏదైనా బహుమతిని కొనుగోలు చేస్తే, 20% డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఈ డిస్కౌంట్ ను పొందాలి అనుకుంటే, ఎస్బిఐ రూపొందించిన ఈ యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది.
దీని ద్వారా ఫెర్న్స్ అండ్ పెటల్స్ లో ఎవరైతే కొనుగోలు చేస్తారో, వారికి 20% డిస్కౌంట్ లభించడం గమనార్హం. ఈ డిస్కౌంట్ పరంగా కస్టమర్లకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే sbi YONO ,sbiyono.sbi యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి , మీ సందేహాలను ఇందులో తీర్చుకోవచ్చు. అయితే ఇటీవల ఎస్బిఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఈ ఆఫర్ను ప్రకటించడం విశేషం.. ఎస్బిఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. "ఈ అతిపెద్ద ఆఫర్ తో  ఈ రక్షాబంధన్ ను  ఆనందంగా జరుపుకోండి.ఫెర్న్స్ అండ్ పెటల్స్ లో కొనుగోలు చెయ్యండి.. 20 శాతం డిస్కౌంట్ కూడా పొందండి.. అంటూ ప్రకటించడం జరిగింది. మీరు ఇందులో 999 రూపాయల విలువగల వస్తువులను కొంటే ఆ ఆఫర్ వర్తిస్తుందని కండీషను కూడా పెట్టడం" గమనార్హం.
ఏది ఏమైనా ఎస్బిఐ కస్టమర్ లకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: