ఈ రక్షాబంధన్ కు భారీ ఆఫర్ ప్రకటించిన ఎస్బిఐ..
దేశీయ దిగ్గజ సంస్థ sbi yono app ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు తోబుట్టువులు రక్షాబంధన్ కడితే, ఆ సోదరులు తమ తోబుట్టువులకు ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటారు. ఇక ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోసమే ఎస్బిఐ ఒక గొప్ప ఆఫర్ ను ప్రకటించింది. అదేమిటంటే , ఫెర్న్స్ అండ్ పెటల్స్ నుండి రూ.999 విలువ వరకు ఏదైనా బహుమతిని కొనుగోలు చేస్తే, 20% డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఈ డిస్కౌంట్ ను పొందాలి అనుకుంటే, ఎస్బిఐ రూపొందించిన ఈ యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది.
దీని ద్వారా ఫెర్న్స్ అండ్ పెటల్స్ లో ఎవరైతే కొనుగోలు చేస్తారో, వారికి 20% డిస్కౌంట్ లభించడం గమనార్హం. ఈ డిస్కౌంట్ పరంగా కస్టమర్లకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే sbi YONO ,sbiyono.sbi యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి , మీ సందేహాలను ఇందులో తీర్చుకోవచ్చు. అయితే ఇటీవల ఎస్బిఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఈ ఆఫర్ను ప్రకటించడం విశేషం.. ఎస్బిఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. "ఈ అతిపెద్ద ఆఫర్ తో ఈ రక్షాబంధన్ ను ఆనందంగా జరుపుకోండి.ఫెర్న్స్ అండ్ పెటల్స్ లో కొనుగోలు చెయ్యండి.. 20 శాతం డిస్కౌంట్ కూడా పొందండి.. అంటూ ప్రకటించడం జరిగింది. మీరు ఇందులో 999 రూపాయల విలువగల వస్తువులను కొంటే ఆ ఆఫర్ వర్తిస్తుందని కండీషను కూడా పెట్టడం" గమనార్హం.
ఏది ఏమైనా ఎస్బిఐ కస్టమర్ లకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.