మనీ : ఇందులో చేరితే సంవత్సరానికి రూ. 25 లక్షలు..

Divya
గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ కొత్త కొత్తగా రూపాంతరం చెందుతూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది ప్రాణాలను కూడా తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఆర్థికంగా మెరుగు పడాలి అని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వివిధ రకాల రంగాలలో పెట్టుబడులు పెడుతూ, లాభార్జన పొందుతున్నారు.. కొంత మంది వ్యవసాయం చేసి డబ్బు సంపాదిస్తే, మరికొంతమంది పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో చేరి డబ్బులు ఆర్జిస్తున్నారు. మరికొంతమంది ఎల్ ఐ సి ల బాట పడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ పథకాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము.

అదేదో కాదు.. షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్ లో కళ్ళు చెదిరే లాభాలను కూడా పొందవచ్చు. అయితే ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత నష్టం కూడా ఉంటుందనే విషయాన్ని,  ప్రతి ఒక్కరూ తప్పకుండా గమనించాలి. లాభనష్టాలకు సిద్ధమైనప్పుడే ఇందులో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అని , షేర్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక్కో షేర్  ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

పోయిన సంవత్సరంలో ఒక్కొక్క షేర్ ధర 393 శాతం వరకు ఎగిసింది. 2020 సంవత్సరం  జూలై 27వ తేదీన ఒక్కొక్క షేర్ ధర 909 రూపాయలు ఉండగా , ఇప్పుడు అదే షేరు ధర 4,490 రూపాయలకు ఎగిసింది. ఇక ఒక్కొక్క షేర్ ధర ఎంత స్థాయిలో పైకి ఎగిసి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఇప్పటికే డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది అనే చెప్పవచ్చు.

ఒకవేళ మీరు సంవత్సరం కిందట రూ. ఐదు లక్షలు పెట్టి ఒక షేర్ ను  తీసుకున్నట్లయితే,  ప్రస్తుతం దాని విలువ రూ.25 లక్షలకు చేరి ఉండేది. ఇక ఈ స్థాయిలో లాభం పొందడం అంటే, అది మాటలు కాదు. కాబట్టి లాభనష్టాలను గమనించుకొని, అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే  షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలని సూచిస్తున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: