మనీ : ఈ బైక్ పై రూ.20వేలు తగ్గింపు..
సాధారణంగా బైక్ ప్రియులకు ఏదైనా ఒక బైక్ నచ్చినప్పుడు, దానిపై ఎంత డబ్బు పెట్టడానికైనా వెనుకాడరు. అయితే ప్రతి ఒక్కరికి టూ వీలర్ అత్యవసరం కాబట్టి అందరి దగ్గర ఖచ్చితంగా ఈ టూ వీలర్ ఉండి తీరాల్సిందే. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి, కొనుగోలు చేయడం కుదరదు.అలాంటి వారికోసం ఒక బైక్ తయారీ సంస్థ ఒక ప్రత్యేకమైన ఆఫర్ ను విడుదల చేసింది. అదేమిటంటే, ఈ బైకుపై 20 వేల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. అయితే ఈ బైక్ కు సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కోమాకి కంపెనీ తమ స్కూటర్ల పై భారీ ఆఫర్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోమాకి TN 95 ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్ పై ఏకంగా రూ.20 వేల వరకు తగ్గించింది.అంతేకాదు కోమాకి తన కంపెనీ కి చెందిన మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ కోమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై కూడా సుమారు రూ.15 వేలను తగ్గించింది.
దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించాలనే పనిలో ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ల ధరలపై కూడా భారీగా తగ్గింపును ప్రకటించి, బైకు కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ఇక ఇదే బాటలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థలు కూడా ఈ ఆఫర్ లను కస్టమర్లకు అందజేస్తున్నాయి. ఇక అందుకే ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ ల ధరలు కూడా గణనీయంగా తగ్గాయని చెప్పవచ్చు.
ఇక ఇప్పటికే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ కూడా తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కూడా గణనీయంగా తగ్గించింది. ఒకినావా , ఏథర్, హీరో వంటి కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ల ధరలపై భారీగా కోతను విధించాయి. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ లపై ధరలు కూడా భారీగా తగ్గడంతో కస్టమర్లకు మరింత ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.