డబ్బే డబ్బు : ప్రత్యర్ధులు మిత్రులుగా మారిన వైనం – లక్షల కోట్ల సంపాదన కై ముందడుగు !
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువ 4.21 లక్షల కోట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థలో అమెజాన్ సంస్థ 40 శాతం వాటా తీసుకుంటున్న నేపధ్యంలో భారతదేశ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా అమెజాన్ రిలియన్స్ ల ఒప్పందం మారబోతోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ కంపెనీ షేర్ విలువ దూసుకుపోతున్న పరిస్థితులలో రిలయన్స్ మార్కెట్ విలువ 15 లక్షల కోట్లు దాటి భారత్ లో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా చరిత్ర సృష్టిస్తోంది.
మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. కరోనా సంక్షోభ సమయంలో 867 రూపాయల వద్ద ట్రేడ్ అయిన ఈ రిలయన్స్ షేర్లు ఈ అమెజాన్ ఒప్పందంతో 2,314 రూపాయల స్థాయికి చేరుకోవడం మార్కెట్ వర్గాలలో సంచలన వార్తగా మారింది. గత మార్చి నెల కనిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుతం రిలయన్స్ ధర రెట్టింపు కావడంతో ఈ సంస్థ వాటా దారులు ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే తన డిజటల్ సేవల కంపెనీ జియోలో 32.84 శాతం వాటా విక్రయం ద్వారా 1,52 వేల కోట్లు సమీకరించింది. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ అమెజాన్ సంస్థతో చేయికలపడం ద్వారా ప్రస్తుతం ఈ కంపెనీ 15 లక్షల కోట్ల కంపెనీగా మారింది అయితే ఈఒప్పందం పై అటు అమెజాన్ సంస్థ కానీ ఇటు రిలయన్స్ సంస్థ కానీ అధికారికంగా స్పందించకపోవడంతో ఈవ్యూహం వెనుక కారణాలు ఏమిటి అంటూ పారిశ్రామిక వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..