మంచి యాక్షన్ సినిమాగా రాబోతున్న సిద్దార్థ్ "టక్కర్ "...!!

murali krishna
సిద్ధార్థ్‌ మరియు దివ్యాంశ కౌషిక్‌ జంట గా నటిస్తున్న సినిమా 'టక్కర్‌'. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ మరియు పాషన్‌ స్టూడియోస్‌ పతాకాల పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
కార్తీక్‌ జి.క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారటా . జూన్‌ 9న తెలుగు, తమిళ భాష ల్లో విడుదలకు సిద్ధమవుతున్నదని తెలుస్తన్నది.ఈ సందర్భం గా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ….'ఈ ఆగస్టుకు నేను హీరో గా పరిచయమై 20 ఏళ్లు అవుతున్నది. ఇప్పటికీ నాకు మంచి అవకాశాలు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
నేను నటించిన పూర్తి కమర్షియల్‌ చిత్రమిది. దర్శకుడు కార్తీక్‌ నన్ను సరికొత్తగా నన్ను తెరపై చూపించాడు. యాక్షన్‌, రొమాంటిక్‌ అంశాలతో సినిమా సాగుతుంది. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నాను.
యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కే దాదాపు 35 రోజుల సమయం తీసుకున్నాం. దివ్యాంశ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రేమకథ ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది' అన్నారు. దర్శకుడు కార్తీక్‌ జి.క్రిష్‌ మాట్లాడుతూ…'ఇది నేటితరం సినిమా అని కూడా చెప్పుకోవచ్చు.
సిద్ధార్థ్‌ను లవర్‌బాయ్‌ లా చాలా కొత్తగా చూపిస్తున్నాను. లవ్‌, కామెడీ, రొమాన్స్‌ వంటి అన్నీ అంశాలుంటాయి. రెగ్యులర్‌ సినిమాల కు భిన్నంగా ఉంటుంది' అన్నారు. సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ..'గతంలో సిద్ధార్థ్‌ సినిమాలు ఎంతగా ఆదరణ పొందాయో చూశాం. ఈ సినిమా కూడా అదే స్థాయి విజయం అందుకుంటుంది' అని చెప్పుకొచ్చారు..సిద్దార్థ్ నటించిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి కానీ. కొన్నాళ్ళకు సిద్దార్థ్ చేసే సినిమాలు రొటీన్ అవ్వడంతో అవి అంతగా ఆడలేదు. దానితో సిద్దార్థ్ తెలుగులో సినిమా చేయలేదు. ఆ మధ్య వచ్చిన మహా సముద్రం సినిమాలో ముఖ్య పాత్ర లో నటించిన అది తనకి నిరాశ మిగిల్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: