చరణ్ తో ఉప్పెన డైరెక్టర్ సెల్ఫీ.. నెట్టింట వైరల్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఇంకా తెలుగు హాట్ హీరోయిన్ అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై భారీగా హైప్ క్రియేట్ చేసింది. అయితే కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నారు చెర్రీ. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో రామ్ చరణ్ తో పాటు బ్లాక్ బస్టర్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన ఉన్నారు. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఇది వరకే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో రాబోయే పై మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. 


స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో సాగే కథ అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఏ క్రీడాకారుడి బయోపిక్ కాదని డైరెక్టర్ బుచ్చిబాబు కూడా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ని కలిశారు బుచ్చిబాబు. రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదిప్పుడు తెగ వైరలవుతుంది. ఇక ఎక్సైంటింగ్ మూమెంట్స్ మున్ముందు అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో… ఫ్యాన్స్ ఈ పిక్ పై కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఉపాసన ఇంకా ఫ్యామిలీతో పూర్తి సమయాన్ని కేటాయించారు రామ్ చరణ్. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు, చెర్రీ సినిమా పట్టాలెక్కనుంది.మరి చూడాలి ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ చేస్తున్న ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో ఇంకా ఎన్ని రికార్డులు కొడతాయో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: