అల్లు అర్జున్ తరువాత సినిమాను ప్రకటించిన ఆ నిర్మాత..!!

murali krishna
టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ మరియు దర్శకుడు త్రివిక్రమ్‌లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌ గా చెప్పవచ్చు. వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తితో పాటు అల వైకుంఠపురములతో సినిమాలు బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
అలా వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డుల ను కూడా తిరగరాసింది. తాజాగా అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ కలయిక లో నాలుగో సినిమా రాబోతున్నట్లు నిర్మాత బన్నీ వాస్ అయితే ప్రకటించారు.
2018 మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్శ్యూలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ మూవీపై బన్నీవాస్ ఆసక్తికర కామెంట్స్ కూడా చేశాడు. పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ, త్రివిక్రమ్ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఆయన ప్రకటించారు. 2024లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని బన్నీవాస్ పేర్కొన్నాడటా.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్నట్లు ఆయన వెల్లడించాడు.
ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మించి ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.బన్నీవాస్ ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ కూడా నెలకొంది.
అల్లు అర్జున్ హీరోగా నటించనున్న 22వ మూవీ ఇదే అని ప్రచారం కూడా జరుగుతోంది. . ప్రస్తుతం పుష్ప -2 షూటింగ్‌తో అల్లు అర్జున్  ఎంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోందటా..
పుష్ప పార్ట్ వన్ పెద్ద విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియన్ లెవల్‌లో సినీ అభిమానులు ఎదురుచూస్తూన్నారు. ఈ సీక్వెల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ క్యారెక్టర్‌ చేస్తున్నాడు.. పుష్ప -2 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.పుష్ప సినిమా మాదిరిగా ఈ సారి భారీ విజయం అందుకోవాలని సుకుమార్ చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయితే సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: