రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ది కేరళ స్టోరీ...!!

murali krishna
ది కేరళ స్టోరీ వివాదం ఇప్పటికీ కొనసాగుతూ నే ఉంది. ఎక్కడో ఒకచోట ఈ సినిమా పై ఆరోపణలు.. నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి .. మే 5న విడుదలైన ఈ ను కొందరు వ్యతిరేకిస్తుండగా..
బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయిందటా ఈ సినిమా . ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్లు రోజు రోజుకీ  బాగా పెరుగుతున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ ఇప్పటి కే 220 కోట్ల వరకూ వసూలు చేసిందని కూడా తెలుస్తోంది. హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ కథానాయికగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.
దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించి న ఈ సినిమా లో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ నటించారు. కేరళ లో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ క్యాంపుల్లో పంపించి దేశ వ్యతిరేకులు గా మార్చారనే కథాంశంతో ఈ సినిమా ను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా పై తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం తెలిసిందే. ఓవైపు థియేటర్లలో బాగా దూసుకుపోతుంది.
అత్యధిక వసూళ్ల రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది . 2023లో ఒక హిందీ చిత్రానికి ఐదవ అత్యధిక ఓపెనర్ గా కూడా ఈ సినిమా నిలిచింది. ఈ ఓటీటీ హక్కులను ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ పారమ్ కొనుగోలు చేసింది. జీ5 ఓటీటీ హక్కులను దక్కించుకుందని సమాచారం..లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ఇప్పటికి ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కానీ బలమైన కథ కధనం కనుక ఉంటే అది ఎలాంటి సినిమా అయిన ఏ భాష లో అయిన ఆ చిత్రాన్ని బాగా ఆదరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: