మల్టీస్టారర్ సినిమా కోసం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య?

praveen
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఇటీవల వీర సింహారెడ్డి తో కూడా మరో హిట్టును ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నడు. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది అని చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో కనిపించబోతుంది.

 ఇక ఈ సినిమాపై అటు బాలయ్య అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. గోపీచంద్ మలినేని బాబి లాంటి దర్శకులు కథలు వినిపించినట్లు టాక్ వినిపిస్తున్న.. అఫీషియల్ అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలకృష్ణ ఒక మల్టీస్టారర్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడట. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటించబోతున్నాడట.

 ఇక ఈ సినిమా తొలి భాగంలో శివరాజ్ కుమార్, బాలకృష్ణ  కలిసి నటిస్తే.. రెండో భాగంలో వీరికి మరో స్టార్  జత కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రజినీకాంత్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఒకవేళ రజినీకాంత్ డేట్స్ ఖాళీ లేకపోతే కమల్ హాసన్ లేదా మమ్ముట్టి మోహన్లాల్ లలో ఎవరినో ఒకరిని ఇక ఈ సినిమాలోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ ప్రాజెక్టుకి హర్ష దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు శివరాజ్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థతో పాటు మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ సినిమాను రూపొందించబోతున్నారట. కాగా దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: