రజిని, బాలయ్య, శివ రాజ్ కుమార్ కాంబోలో మూవీ?

Purushottham Vinay
ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ ముగ్గురూ స్టార్ హీరోస్ కలిసి త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు.KGF లాగానే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు.ముఖ్యంగా మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ అనేది ఎప్పటి  నుంచో జోరందుకుంది.సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2 లాంటి మల్టీ స్టారర్ సినిమాలు టాలీవుడ్ లోకి వచ్చి ఇప్పటి యూత్ ని బాగా అలరించాయి. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించగా, బీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ తరువాత చిత్రం బ్రో కూడా మల్టీ స్టారరే. ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించారు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్ సలార్ లో నటిస్తున్నారు. ఈ స్టార్ సినిమాల ట్రెండ్ ని టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ మరో ఎత్తుకు తీసుకెళ్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో కలిసి బాలకృష్ణ మల్టీ స్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఓ ఫేమస్ కన్నడ డైరెక్టర్ తెరకెక్కిస్తారని సమాచారం వినిపిస్తోంది. ఇక తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో.. శివరాజ్ కుమార్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు బాలకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే ఇక అభిమానులకి పెద్ద పండగే అని చెప్పాలి. వీరి కాంబినేషన్ లో సినిమా కోసం వీరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ కాంబినేషన్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: