మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 2018?

Purushottham Vinay
మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన మూవీ 2018. 7 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ ఆ మూవీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 2018 నిలిచింది. రిలీజైన తర్వాత  కేవలం 17 రోజుల్లోనే ఆ సినిమా ఈ సూపర్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. యంగ్ హీరో టొవినో థామస్ నటించిన ఈ మలయాళ సినిమా ఇప్పటి దాకా ఏకంగా రూ.137.60 కోట్లు వసూలు చేసింది.ఇప్పటి దాకా ఈ రికార్డు సీనియర్ హీరో మోహన్ లాల్ నటించిన పులిముమరుగన్ పేరిట ఉండేది. ఆ సినిమా మొత్తం రూ.137.35 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడా రికార్డును 2018 సినిమా అలవోకగా బ్రేక్ చేసింది. ఈ సినిమా ఒక్క కేరళలోనే ఏకంగా రూ.65.25 కోట్లు రాబట్టింది. ఇక మరో రూ.8.4 కోట్ల వసూళ్లు ఇండియాలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి ఏకంగా రూ.63.95 కోట్లు రావడంతో 2018 ఈ సూపర్ రికార్డు సాధించింది.


ఇక కేవలం కేరళ వరకూ చూసుకుంటే 2018 నాలుగో స్థానంలో ఉంది. ఇక ఈ లిస్టులో పులిమురుగన్ రూ.78.5 కోట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా రూ.73 కోట్లు ఇంకా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూ.68.5 కోట్ల వసూళ్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం 2018 సినిమా జోరు చూస్తుంటే.. రానున్న వీకెండ్ లో ఈ సినిమాల రికార్డులన్నీటిని కూడా ఈజీగా బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కినది ఈ సినిమా. ఇక ఆ వరదల్లో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 2018 మూవీకి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.ఇక ఈ మధ్యే తెలుగు ట్రైలర్ కూడా రిలీజైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: