నైజాంలో రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన టాప్ 9 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేస్తున్న విషయంలో మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మూవీ లలో మొదటి రోజు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందినటువంటి ఖుషి మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 1.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 1.26 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక , అంకిత హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ మొదటి రోజు నైజం ఏరియాలో 1.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ని నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: