ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో నాగచైతన్య ఏం మాట్లాడారంటే..?

Divya
ఎన్టీఆర్ వందోవ జయంతి వేడుకలు మే 28వ తేదీన నందమూరి శతజయంతి వేడుకలను ప్రారంభించారు...నిన్నటి కూడ రోజున కూడ ఎన్టీఆర్ 100 జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో కూడా జరుగుతూ వస్తోంది ఇటీవల విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి రజనీకాంత్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది.తాజాగా హైదరాబాదులో KPHB గ్రౌండ్ల మరొక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, రామ్ చరణ్, నాగచైతన్య, శివరాజ్ కుమార్, అడవి శే,షు తదితరులు సైతం హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి అక్కినేని వారసులు హాజరవ్వడంతో అందరి దృష్టిని ఆశ్చర్యాన్ని కలిగించేస్తోంది .ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు గురించి బాలయ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా బహిరంగ లేక విడుదల చేయడం జరిగింది. ఇలాంటిది ఇప్పుడు ఈ వేడుకకు చైతన్య కనిపించడంతో బాలయ్యతో కలిసి మాట్లాడటం అక్కినేని అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తోంది ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు బాలకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు అంటూ తెలిపారు నాగచైతన్య.

నందమూరి తారక రామారావు గారి నటన అందం ఆయన గురించి సపరేటుగా చెప్పాల్సిన అవసరం లేదు రాముడు శ్రీకృష్ణుడు గురించి ఎవరైనా మాట్లాడే ముందు మనకు గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ మా ఇంట్లో తాతగారు ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడిన చాలా గౌరవంగా మాట్లాడేవారు అంటూ తెలియజేశారు. అక్కడికి వచ్చిన కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేకపోవడంతో పలువురు అభిమానుల సైతం కాస్త నిరాశ తో ఉన్నట్లు తెలు స్తోంది. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: